రేపే సెమీస్.. భారత్‌కు కఠిన సవాల్

1751చూసినవారు
రేపే సెమీస్.. భారత్‌కు కఠిన సవాల్
మహిళల ప్రపంచకప్‌ టీ20లో భాగంగా ఎన్నో ఆశల మధ్య సెమీస్ చేరిన టీమిండియా రేపు జరిగే సెమీస్‌లో కఠిన సవాల్ ఎదుర్కోనుంది. గురువారం సాయంత్రం జరిగే మ్యాచ్ పటిష్ట ఆస్ట్రేలియాతో జరుగుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. ఆ జట్టు వరుసగా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై అలవోకగా విజయాల్ని సాధించి సెమీస్‌కి చేరింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా టీమ్‌ని ఓడించాలంటే భారత్ మహిళల టీం కాస్త శ్రమించాల్సిందే. ALL THE BEST TEAM INDIA