ఫోన్ ట్యాపింగ్‌పై ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

58చూసినవారు
ఫోన్ ట్యాపింగ్‌పై ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడే. కాంగ్రెస్ హైకమండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గత ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారు' అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్