హిందూ మతం, దేవాలయాలపై వైసీపీ దాడులు చేస్తోందని గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన జనసేన తాజాగా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ధ్వంసమైన దేవతా విగ్రహాలు, కాలిపోయిన రథాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. "ఇది సనాతన ధర్మంతో నడుస్తోన్న దేశం.. కర్మ భూమి. హిందూ ధర్మం జోలికి రావొద్దు, అవమానించొద్దు. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకండి. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా!" అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఉన్నాయి.