లోక్సభ ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేసినట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారు. తమ అంచనాలు 20 శాతం తప్పుగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ బీజేపీ ఓటు శాతం స్థిరంగా ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సుమారు 300 సీట్లు వస్తాయని, సొంత బలంతోనే మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పోలింగ్కు ముందు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే ఫలితాల్లో బీజేపీకి 240 సీట్లు వచ్చాయి.