విదేశాలకు వెళ్లి, అక్కడ జరిగిన దాడులలో ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అమెరికా వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తుపాకీతో ఓ కన్వీనియన్స్ స్టోర్లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ భారతీ సంతతికి చెందిన వ్యక్తి, అతని కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వర్జీనియాలోని భారతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది. తన భద్రతపై వారందరు ఆందోళన చెందుతున్నారు.