తొగుట మండల కేంద్రానికి చెందిన కాసర్ల మైసవ్వ(63) చెరువులో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం.. మైసవ్వ భర్త మైసయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కుమారులు మల్లేశం కనకయ్య, కూతురు కవితల వివాహమైంది. కొంతకాలంగా మతిస్తిమితం సరిగా లేకుండా ఉన్న మైసవ్వ చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లుగా కుటుంబీకులు తెలిపారు. ఈ మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.