మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు కోసం నార్సింగిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కుమ్మరి బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్కు ఓటువేసి గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.