కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎంపీడీవో

77చూసినవారు
చేగుంట మండలం వడియారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీవో చిన్నారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోవద్దని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన వెంటనే డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్