కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

83చూసినవారు
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
గ్రామస్థాయిలో పనిచేస్తున్న వివోఏలకు కనీస వేతనం 26వేలు ఇస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాల స్వామి అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని వివోఏలు సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ముట్టడికి అందరూ సకాలంలో హాజరై జయప్రదం చేయాలని తెలిపారు. వివోఏల 58 జీవోను సవరించి వారికి మూడు నెలల రెన్యువల్ పద్ధతిని రద్దు చేయాలన్నారు. ప్రమాద బీమా 10 లక్షలు అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్