పెద్దమ్మ దేవాలయంలో చోరీ కలకలం

11905చూసినవారు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో చోరీ కలకలం రేపింది. లక్ష్మినగర్ గ్రామంలో అర్థరాత్రి స్థానిక శ్రీ పెద్దమ్మ దేవాలయంలో దొంగలు తాళాలు ధ్వంసం చేసి చోరికి పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహంపై ఉన్న తులం నర బంగారం, వెండి వస్తువులు, హుండీ ధ్వంసం చేసి అందులోని నగదు ఎత్తుకెళ్లినట్లు ముదిరాజ్ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్