రోడ్డు ప్రమాదంలో బస్సు బైకును ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలైన ఘటన హుస్నాబాద్ లోని అక్కన్నపేట మండలంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం పంతులు తండాలో నివాసం ఉంటున్న కరంటోతు రాజు తన భార్య స్వరూప మరదలు కవిత ను తీసుకొని అక్కన్నపేటలో బైకుపై వస్తుండగా హుస్నాబాద్ డిపో బస్సు ఎదురుగా వస్తున్న బైకును ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.