ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెజ్జంకి గ్రామానికి చెందిన కాటా కాస్పరాజ్ 15 సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ లెబర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మోడ్రన్ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ లోని స్టాండ్ కు ఊరి వేసుకొని చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.