సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మంగళవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. 1. 9 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకోవడంతో పాటు నిందితుల వద్ద నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకవచ్చారు, ఎక్కడ అమ్ముతున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.