ఘోర ప్రమాదం.. ఇరుక్కుపోయిన డ్రైవర్

38666చూసినవారు
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డు ఎంకేపల్లి చౌరస్తా వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని అతివేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. స్థానికులు స్పందించి 108 వాహనానికి సమాచారం అందించారు. డ్రైవర్ ను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్