విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత

51చూసినవారు
విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత
సిద్దిపేట అర్బన్ మండలంనకు చెందిన ఇటీవల పదవతరగతి ఉత్తీర్ణులై 9 అంతకంటే ఎక్కువ జీపీఏ సాధించిన, ఏడుగురు మంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు, ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ కన్వీనర్ బోరెడ్డి మధుసూధన్ జెడ్పిహెచ్ ఇందిరానగర్ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు. ఈ డబ్బును ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు మొసర్ల మాధవరెడ్ది అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, మండల విద్యాధికారి సత్తు యాదవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్లొన్నారు.
ఉచితంగా నోట్ పుస్తకాల పంపిణీ
http://bit.ly/2JEHNGx