వ్యవసాయ పంటల కోసం తక్షణమే నీరు విడుదల చేయాలి

85చూసినవారు
రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి అయోమయంగా ఉందని, విద్యుత్ కోతలు, సాగు నీరు లేక రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతు దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా రైతులు సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ పంటల కోసం తక్షణమే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్