డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన చెర్లపల్లి వాసి

82చూసినవారు
డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన చెర్లపల్లి వాసి
ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన పడిదం రాయనర్సు లక్ష్మీల కుమారుడు పడిదం నరేష్ డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటి ఉద్యోగం సంపాదించాడు. జగిత్యాల జిల్లాకు చెందిన పడిదం నరేష్ 100 మార్కులకు గాను 69. 20 మార్కులు సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యారు. నరేష్ స్కూల్ అసిస్టెంట్ గణితంలో ప్రభుత్వ కొలువు కైవసం చేసుకోవడం పట్ల చర్లపల్లి గ్రామస్థులు, సహచర బంధు మిత్రులు, పలువురు నేతలు అభినందనలు తెలిపారు. నరేష్ 2019 నుంచి మీడియా రంగంలో సీనియర్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్