ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పల్లెర్ల నారాయణ భార్య పల్లెర్ల లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబానికి కొలుముల దామోదర్ యాదవ్ అండగా నిలిచారు. మృతురాలిది నిరుపేద కుటుంబం కావడంతో 10, 000 రూపాయల ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొలుముల గంగన్న, పులకొల్ల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.