మహిళల భద్రతే షీ టీమ్ లక్ష్యమని షీ టీమ్ ఇన్చార్జి, ఏఎస్ఐ మల్లయ్య తెలిపారు. శుక్రవారం ముత్తారం మండలం దరియాపూర్ టీజీఎంఎస్ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది స్నేహాలత, సురేష్తోపాటు హెచ్ఎం రాజ్యలక్ష్మి, ఉపాద్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.