రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ అధికారులు వేములవాడ నియోజకవర్గంలో ఓటర్స్ నమోదు ప్రక్రియను ప్రారంభించారు. వేములవాడ నియోజకవర్గంలోని 260 బూతుల పరిధిలో ఒక్కొక్క బూతుకు ఒక్కొక్క బూతు లేవల్ అధికారిని నియమించారు. వీరి ద్వారా వోటర్స్ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఆర్డీవో రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.