విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు మృతి (వీడియో)

55చూసినవారు
ఉత్తర సిక్కింలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సిక్కింలోని మంగన్ జిల్లాలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి ఆరుగురు చనిపోయారు. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. ఈ మేరకు గురువారం అధికారులు సమాచారం అందించారు. ఇటీవల సంగ్‌కలాంగ్‌లో కొత్తగా నిర్మించిన బెయిలీ వంతెన కూలిపోవడంతో మంగన్, డిజాంగ్ మరియు చుంగ్తాంగ్ ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్