అమెరికాలో స్పల్ప భూకంపం సంభవించింది. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ తూర్పున లాండ్ ఐలాండ్ వరకు 4.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం సుమారు 4.2 కోట్ల మందిని కలవరపాటుకు గురిచేసింది. అయితే ఈ భూకంపంపై న్యూయార్క్లో ఉన్న భారత ఎంబసీ స్పందించింది. ఇప్పటివరకు ఏ భారతీయుడు ఈ ప్రకృతి విపత్తు వల్ల గాయపడలేదని ఎక్స్లో తెలిపారు.