భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరో అరుదైన రికార్డ్ సృష్టించారు. అన్ని ఫార్మట్లలో కలిపి 7 వేల పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్గా రికార్డు నమోదు చేశారు. సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ జరుగుతున్న మొదటి మ్యాచ్లో స్మృతి మంధాన సెంచరీతో చెలరేగింది. ఈ క్రమంలో 7 వేల పరుగులు పూర్తి చేసుకుంది. కాగా, 10,868 పరుగులతో ఇండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మొదటి స్థానంలో ఉంది.