వరదలో కొట్టుకుపోయి జవాన్లు మృతి?

81చూసినవారు
వరదలో కొట్టుకుపోయి జవాన్లు మృతి?
లడఖ్‌లోని న్యోమా-చుషుల్ ప్రాంతం శనివారం విషాద ఘటన జరిగింది. సైనిక డ్రిల్‌లో భాగంగా T-72 యుద్ధ ట్యాంక్‌‌తో ఐదుగురు జవాన్లు నది దాటారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో వరదలో యుద్ధ ట్యాంక్ కొట్టుకుపోయింది. దానిలోని ఐదుగురు జవాన్లు జలసమాధి అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఒకరి మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్