పార్టీ ఫిరాయింపులపై ఎర్రవల్లి ఫాంహౌస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ లంచ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కొందరు నేతలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోచారం శ్రీనివాస్రెడ్డి పార్టీ మారటాన్ని పట్టించుకోవద్దని సూచించారు. భవిష్యత్తులో మనకు మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.