తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

76చూసినవారు
తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నాగర్‌కర్నూల్‌, గద్వాల్‌, నల్గొండలోకి ప్రవేశించడంతో పాటు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. ఈసారి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం కారణంగా సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. మంగళవారం నుంచి 3 రోజుల పాటు దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు రావచ్చని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్