సోషల్ మీడియా లింక్‌లను ఓపెన్ చేయొద్దు: పోలీసులు

68చూసినవారు
సోషల్ మీడియా లింక్‌లను ఓపెన్ చేయొద్దు: పోలీసులు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో బ్యాంకు ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఎర వేశారు. షేర్ మార్కెట్‌లో లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియా ద్వారా నమ్మించారు. పంపించిన లింక్ ద్వారా బ్యాంకు ఉద్యోగి నుంచి రూ.34 లక్షలు కొట్టేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే లింకులను అసలు ఓపెన్ చేయొద్దని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్