అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలును
బీజేపీ ఏర్పాటు చేసింది. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది.
బీజేపీ ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ప్రత్యేక రైలులో 1,346 మంది ప్రయాణికులు, రామ భక్తులు ఉన్నారు.