దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు సరికొత్త రికార్డులను తిరగరాశాయి. సెన్సెక్స్ 350.81 పాయింట్ల లాభంతో 74,227.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 22,514.65 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.44గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో HDFC బ్యాంక్, టైటాన్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, TCS షేర్లు లాభపడ్డాయి.