దేశీయ స్టాక్ మార్కెట్ను నష్టాలు వెంటాడుతున్నాయి. స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్ 217 పాయింట్లు నష్టపోయి 74,115 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 22,460 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 38 పైసలు క్షీణించి 87.33గా ఉంది