లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
By Somaraju 75చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవనకాల గరిష్ఠమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్ఠాల్లో ముగిసింది. టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, TCS, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. NTPC, SBI, ఎల్అండ్టీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.