దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 383.69 పాయింట్లు క్షీణించి 73,511.85 వద్ద, నిఫ్టీ 140.69 పాయింట్లు పడిపోయి 22,302.50 వద్ద ముగిశాయి. సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా షేర్లు లాభపడగా, పవర్గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, JSW స్టీల్ నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.52గా ఉంది.