దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109.09 పాయింట్ల నష్టంతో 80,039.80 వద్ద, నిఫ్టీ 7.40 పాయింట్ల నష్టంతో 24,406.10 వద్ద నిలిచాయి. టాటా మోటార్స్, ONGC, SBI లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, సన్ ఫార్మా వంటి కంపెనీలు లాభాల్లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, నెస్లే, టైటాన్ కంపెనీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.