దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 22,703కు చేరింది. సెన్సెక్స్ 203 పాయింట్లు పుంజుకుని 74,883 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.21 వద్ద ప్రారంభమైంది. టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. HDFC బ్యాంక్, సన్ఫార్మా షేర్లు నష్టాల్లో ఉన్నాయి.