ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో 10 మందికిపైగా BRS నేతలు కీలకంగా వ్యవహరించినట్లు.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అయితే తనకు కీలక పోస్టు అప్పగించడం, రిటైర్మెంట్ను మరో మూడేళ్లపాటు పొడగించుకోవడం వెనుక ఉన్న ప్రభుత్వాధికారుల పేర్లను చెప్పినట్లు తెలుస్తోంది.