ప్రస్తుత తెలంగాణ సీఎం, TPCC చీఫ్ రేవంత్రెడ్డి.. 2015లో TDPలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50 లక్షల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే, మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో సంచలనం సృష్టిస్తుంది.