ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను అధిష్టానం ప్రకటించింది. విశాఖ ఎంపీ స్థానంతో పాటు భీమిలి, దక్షిణం, గాజువాక అభ్యర్థులను ప్రకటించారు. ఎంపీ స్థానాన్ని సినీ నిర్మాత పులుసు సత్యనారాయణ రెడ్డికి కేటాయించారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా. విశాఖలో స్థిరపడ్డారు. తెలుగు సేన పార్టీని స్థాపించి.. తర్వాత కాంగ్రెస్లో చేరారు.