మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద మంగళవారం పెద్ద ఎత్తున ప్రత్యర్థి పార్టీల నాయకులు తరలి వచ్చారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాసేపటికే పేర్ని నాని ఇంటిపై పలువురు రాళ్లు విసిరారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయినప్పటికీ అల్లర్లు సద్దుమణగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.