దాడులు ఆపండి: చంద్రబాబుకు షర్మిల విజ్ఞప్తి

83చూసినవారు
దాడులు ఆపండి: చంద్రబాబుకు షర్మిల విజ్ఞప్తి
ఏపీలో వైసీపీ నేతలు, వైఎస్ విగ్రహాలపై జరుగుతున్న దాడుల్ని ఆపించాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఓ లేఖను విడుదలచేశారు. చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నామని లేఖలో తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్