యూపీలోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై 20 మందికి పైగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. పోలీసుల వివరాల ప్రకారం.. మార్చి 29న స్నేహితుడితో కలిసి పిషాచ్మోచర్ ప్రాంతంలోని హుక్కా బార్కు వెళ్లింది. అక్కడికి మరికొంతమంది వచ్చారని, కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి, తర్వాత వేరు వేరు హోటల్లలో వారం రోజులపాటు విద్యార్థినిపై 23 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.