హైదరాబాద్లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చెంగిచర్లకు చెందిన జగన్నాథన్ చారి (50) కార్పెంటర్ పని నిమిత్తం అబిడ్స్ వైపు వెళ్తుండగా సిమెట్రీ దగ్గర వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జగన్నాథన్ చారి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.