ట్రాక్టర్ బోల్తాపడి ఒకరి దుర్మరణం

546చూసినవారు
భూధాన్ పోచంపల్లి మండలం ధర్మారెడ్డిపల్లిలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం గ్రామస్తుల వివరాలిలా.. ప్రమాదంలో శివం అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్