మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. మనోర్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న బైక్ను RTC బస్సు ఢీకొట్టింది. బైక్పై భర్త, తన ఏడాది కుమారుడితో ప్రయాణిస్తున్న మహిళ కింద పడిపోయింది. ఆమెపై నుంచి బస్సు వెళ్లిపోయింది. బస్సు చక్రాల కింద నలిగి ఆమె చనిపోయింది. మృతురాలిని గోవాడే-నేతాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ సోనాల్ లోఖండే (30)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.