ఉరి వేసుకుని వ్యక్తి మృతి
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో జరిగింది. ఆదివారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన అశోక్ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం అతని పిల్లలు సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.