ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి

11381చూసినవారు
ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన గుడు గుంట్ల పాలెం సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. పాలకవీడు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన వెంకట రమణారెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో గాయాలు కావడంతో వెంకటరమణారెడ్డి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట నరసయ్య తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్