
హుజూర్ నగర్: సేవాలాల్ జయంతి కన్వీనర్ గా తులసి రామ్
సంత్ సేవాలాల్ 286వ జయంతి హుజూర్ నగర్ నియోజకవర్గ కన్వీనర్ గా మఠంపల్లి మండలము చెన్నాయపాలెం గ్రామానికి చెందిన బానోతు తులసి రామ్ నాయక్ ను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 15న జరిగే సంత్ శ్రీ సేవాలాల్ భోగ్ భండారో కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోకో కన్వీనర్ సైదులు, భూక్యా మంజీనాయక్ ఉన్నారు.