విశాఖ(D) గాజువాకలో చంద్రబాబు సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆయనపై రాయి వేసేందుకు ఓ దుండగుడ
ు యత్నించాడు. ప్రచార వాహనం వెనుక నుంచి రాయి విసిరి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. "నిన్న సీఎంపై, ఇప్పుడు నాపై, తెనాలిలో పవన్ కల్యాణ్పై రాళ్లు వేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఈ పని వేస్తోంది. నిన్న జరిగిన డ్రామా గురించి కూడా తేలుస్తా." అని చంద్రబాబు ఆగ్రహించారు.