వైఎస్ జగన్పై జరిగిన దాడి ఘటన మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మరియు టీడీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాయిని విసిరింది ఎవరో షార్ప్ షూటర్, గురితప్పకుండా కొట్టగలిగినవాడై ఉండాలి. జగన్కు తగిలిన రాయి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలి ఆయన కన్ను పోయే పరిస్థితి వచ్చిందని సజ్జల అన్నారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసుల విచారణ జరుగుతోందని అన్నారు.