రేషన్ బియ్యం పట్టివేత

21861చూసినవారు
రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గరిడేపల్లి ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గడ్డిపల్లి నుంచి గరిడేపల్లి వైపు అక్రమంగా తరిస్తున్నట్లు సమాచారం అందడంతో వాహనాలు తనిఖీ చేసినట్లు శనివారం తెలిపారు. పొనుగోడు క్రాస్ రోడ్డు వద్ద డీసీఎం వ్యానులో తనిఖీ చేయగా 24 క్వింటాళ్ల బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు డ్రైవర్ పై కేసు నమోదు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్