పిడుగుపాటుకు పాడి రైతు మృతి

82చూసినవారు
పిడుగుపాటుకు పాడి రైతు మృతి
పిడుగు పాటుకు రైతు మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని నల్లబండ గూడెంకి చెందిన పొందూరు రామారావు గేదెలు పెంచుకుంటూ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే గేదెలను గుడిబండ రోడ్డులోని వ్యవసాయ భూమిలోకి మేతకు తీసుకెళ్లగా సాయంత్రం ఉరుములతో కూడిన వర్షానికి పిడుగు పడి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్